మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా అక్కడి పోలీసులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా కరోనా మరో 77 మంది పోలీసులకు సోకిందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. తాజాగా దీనిపై మహారాష్ట్ర పోలీసులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. 

 

త 24 గంటల్లో మహారాష్ట్రలో 77 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకింది అని వెల్లడించారు. ఒకరు కరోనా కారణంగా మరణించారు అని వివరించారు. మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 1,015 గా ఉంది అని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వారి సంఖ్య 60 కి చేరుకుందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: