కృష్ణా జిల్లాలో ఇప్పుడు వరుస రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. మంత్రి పేర్ని నానీ అనుచరుడు ఒకరిని ఇటీవల ప్రత్యర్ధులు హతమార్చగా తాజాగా మరో నేతను ప్రత్యర్ధులు చంపేశారు. నాగాయిలంక మండలం, పరచివరలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి తాతా సాంబయ్యను అత్యంత దారుణంగా హత్య చేయడం ఇప్పుడు కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అలజడి రేగింది. 

 

నాగాయిలంక నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా మరకపాలెంవద్ద కాపు కాసి ఆయనను అత్యంత దారుణంగా హత్య చేసారు. హత్య ఎందుకు జరిగింది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఆయనకు అధికార పార్టీ నేతలకు ఏమైనా గొడవలు ఉన్నాయా అనే దాని మీద ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఒక మహిళ ఈ హత్యలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: