ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్ ను ముగించాయి. సెన్సెక్స్ 498 పాయింట్లు లాభపడి 35,414 దగ్గర, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 10,430 దగ్గర ట్రేడింగ్ ను ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ లో స్వాన్ ఎనర్జీ, ఇండియన్ బ్యాంక్, కే.ఆర్.బీ.ఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్, జీఐసీ హౌసింగ్, లాంటి సంస్థలు లాభపడ్డగా శ్రెయి ఇన్ఫ్ట్రా, అదానీ గ్రీన్ ఎనర్జీ, క్యూస్ కార్ప్, టినాడు న్యూస్ ప్రింట్ , ఓమెక్సా లాంటి సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. 
 
ఈరోజు ఓ.ఎన్.జీ.సీ షేర్లు 4 శాతం నష్టపోగా హెచ్.డీ.ఎఫ్.సీ, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్ సంస్థలు 4 శాతం లాభపడ్డాయి. ఓ.ఎన్.జీ.సీ నష్టాలను ప్రకటించడంతో వాటాదారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నేడు బ్యాంక్ నిఫ్టీ సూచీ భారీగా లాభపడింది. న్యూస్ ప్రింట్, అదానీ గ్రీన్ ఎనర్జీ, క్యూస్ కార్ప్ షేర్లు కూడా నష్టపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: