తెలంగాణా ఇంటర్ బోర్డ్ లో ఇప్పుడు కరోన  కలకలం రేగింది. ఇంటర్ బోర్డు లో పలువురు అధికారులకు కరోనా సోకింది. ఇటీవల ముగ్గురు అధికారులకు కరోనా సోకగా ఆ తర్వాత అధికారులకు కరోనా పరిక్షలు చేయగా మొత్తం 18 మందికి  కరోనా సోకింది అని  ప్రకటించారు. ఇక మిగిలిన ఉద్యోగులు అందరికి కూడా కరోనా పరిక్షలు నిర్వహించారు అధికారులు.

 

వాటి రిపోర్ట్ రేపు వచ్చే అవకాశం ఉంది. దీనితో అధికారులలో అలజడి మొదలయింది. ఇక అధికారుల సిబ్బందిని కూడా ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉంచుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరిక్షలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మిగిలిన ఉద్యోగులు అందరిని కూడా విధులకు రావొద్దు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: