ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ను ఇప్పుడు పలువురు దర్శకులు నిర్మాతలు, సంగీత దర్శకులు అందరూ కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 108 వాహనాలను భారీగా  ప్రారంభించిన నేపధ్యంలో ఇప్పుడు... ఆయనను పలువురు ఇది సరికొత్త అధ్యాయం అంటూ కీర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉండే ప్రముఖ జర్నలిస్ట్ లు కూడా ఆయనను కీర్తిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

అదే విధంగా ప్రముఖ దర్శకుడు గోపి చంద్ మలినేని అదే విధంగా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, అలాగే కోన వెంకట్ సహా పలువురు సిఎం జగన్ ను కీర్తిస్తున్నారు. ఇది నిజంగా అత్యధ్బుతమైన కార్యక్రమం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కనీవినీ ఎరుగని కార్యక్రమం అని పేర్కొంటూ పోస్ట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: