టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కోర్ట్ లో వాదనలు ముగిసాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదు అని,ఆయన ఆరోగ్యం బాగా లేదు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తరుపు న్యాయవాది కోర్ట్ కి వివరించారు. ఆయన ఎప్పుడు పిలిచినా సరే  విచారణకు హాజరు అవుతారు అని పేర్కొన్నారు. 

 

వాదనలు అన్నీ ముగిసిన నేపధ్యంలో... తీర్పుని ఏసీబీ కోర్ట్ రిజర్వ్ లో ఉంచింది.  కాగా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసారు. ఆయన పూర్తిగా కోలుకున్నారు అని అధికారులకు వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. టీడీపీ నేతలు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి భారీగా చేరుకున్న నేపధ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: