మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పోలీసులు ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. విజయవాడ సబ్ జైల్ దగ్గరికి రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా మహేశ్వర రావు వచ్చారు. అక్కడ ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడును ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని అన్నారు. ఆరోగ్యం బాగుంటే అంబులెన్స్ లో ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. 
 
ఆంబులెన్స్ నుంచి జైలుకు వీల్ చైర్ లో ఎందుకు తరలించారో చెప్పాలని అన్నారు. డాక్టర్లు అసలు ఏమి రిపోర్ట్ ఇచ్చారో తమకు తెలియాలని.... రేపు బెయిల్ వస్తుందని ప్రచారం జరగగా ఈరోజు అచ్చెన్నాయుడును జైలుకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం కావాలనే కింజరాపు కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ ఈ రకమైన ప్రచారం చేస్తోందని అన్నారు. జగన్ అవినీతి పై కింజరపు కుటుంబం కేసులు వేసిందని.... జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వంతో అన్నీ గుర్తు పెట్టుకున్నాడని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: