ఈరోజు గుంటూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అచ్చెన్నాయుడు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. జిల్లా జైలులో ఆయనకు పోలీసులు 1573 నంబర్ ను కేటాయించారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్ట్ లో కొద్దిసేపటి క్రితం వాదనలు ముగిశాయి. అచ్చన్నాయుడు న్యాయవాది ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ కోర్టుకు వినిపించాడు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెనాయుడు కోర్టు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటారని న్యాయవాది తెలిపారు. 
 
ఇరు వాదనలు విన్న ఏసీబీ ఇంచార్జి కోర్ట్ మరో రెండు, మూడు రోజుల్లో తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఆయన ఇంటిలో ఎసిబి అదికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో ఉండగానే ఆయనను ఎసిబి విచారించింది.అయితే విచారణలో ఆయన సహకరించలేదని ఎసిబి చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: