గురువారం నుంచి ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందించాలని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలను వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కళాశాలల్లో కరోనా చికిత్సకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.

 

ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి, సంతోష్ నగర్ ఓవైసి ఆస్పత్రులను మంత్రితో పాటు అధికారులు సందర్శించారు. ఇవాళ్టి నుంచి మెడికల్‌ కాలేజీల్లో చికిత్స ప్రారంభించాలని యాజమాన్యాలకు ఈటల నిర్ధేశించారు

మరింత సమాచారం తెలుసుకోండి: