చైనా యాప్స్ను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో స్వాగతించారు. ఈ నిర్ణయంతో భారత సమగ్రత, దేశ జాతీయ భద్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భారత్కు ఫ్రాన్స్ అండగా ఉంటుందని ఆ దేశ రక్షణమంత్రి ఫ్లోరెన్స్ పార్లె ఇటీవలే వెల్లడించారు. తాజాగా... 59 చైనా యాప్స్ను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఈ నిర్ణయం భారత సమగ్రత, దేశ జాతీయ భద్రతను పెంపొందిస్తుందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు.
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో హింసాత్మక ఘటన నేపథ్యంలో భారత్లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే టిక్టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్స్ను భారత్ నిషేధించింది.