ముంబైలో ప్రతీ ఏటా జరిగే గణేష్ చతుర్థి వేడుకలను ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి 2021 ఫిబ్రవరి వరకు వాయిదా వేయడంపై నటి అమృతా రావు హర్షం వ్యక్తం చేసింది. వేడుకలను తమ గణేష్ పండల్ కమిటీ సకాలంలో నిర్ణయం తీసుకుంది అని ఆమె కొనియాడారు. 

 

దీనిపై ఆమె మాట్లాడుతూ... నేను నా చిన్నతనం నుండే పండల్‌ను సందర్శిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది 'దర్శనం' లేకుండా నా గణేష్ చతుర్థి వేడుక అసంపూర్ణంగా ఉందన్న ఆమె... అయితే నేను విరాళాల గురించి లేదా మరే ఇతర అంశాల గురించి ఆలోచించకుండా, ప్రజల ఆరోగ్యం కోసం వారు ఈ ఆగస్టులో తమ పండల్ వేడుకను వాయిదా వేసినందుకు జిఎస్బి సమితి నిర్ణయం తనను ఆకట్టుకుంది అని వారికి థాంక్స్ చెప్తున్నా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: