దేశ వ్యాప్తంగా తమిళనాడు లోని తండ్రీ కొడుకుల లాకప్ డెత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వారి మరణం విషయంలో పోలీసుల తీరుని తీవ్రంగా తప్పుబడుతూ తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

 

దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన తూత్తుకుడి శాతంకులంలో తండ్రి ,కొడుకుల లాకప్‌ డెత్‌పై  సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. వారి మరణానికి కారణం కూడా వెల్లడించింది. శాతంకులం పోలీసులు కొట్టిన దెబ్బలకే తండ్రి ,కొడుకు మృతిచెందారని పోస్టుమార్టం  రిపోర్ట్ లో వెల్లడి౦చారు. ఇక ఈ కేసుపై కేంద్ర హోం శాఖ కూడా ఆరా తీసింది. బాధ్యులు అయిన పోలీసులపై శాస్వతంగా నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: