ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని అధికార పార్టీ వాడుకుంటుంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి గానూ ప్రశాంత్ కిషోర్ ని వాడుకోవడంపై ఇప్పుడు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. 

 

మీపార్టీ బలోపేతానికి పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా ఎం.ఎల్.ఓ లను ఎలా నియమిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మీ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకొని ఏడాదికి 5 వేల కోట్లు ప్రభుత్వ డబ్బును ఎలా ఖర్చు పెడతారు? ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ అంటూ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: