దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు కట్టడి చేస్తున్నా ఆగడం లేదు. ఇక ఆరు లక్షల కేసులు దాటాయి దేశంలో. గత 24 గంటల్లో మరోసారి 19 వేల కేసులు నమోదు అయ్యాయి దేశంలో. అదే విధంగా 434 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 19,148 కొత్త కరోనా కేసులు నిన్న నమోదు అయ్యాయి. 

 

దేశ వ్యాప్తంగా కరోనా మొత్తం కేసుల సంఖ్య 6,04,641 గా ఉందని  కేంద్రం వెల్లడించింది. వీటిలో 2,26,947 క్రియాశీల కేసులు ఉన్నాయి. 3,59,860 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 17834 మంది దేశ వ్యాప్తంగా మరణించారు అని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: