దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు 20 వేల వరకు నమోదు అవుతున్నాయి. జూన్ నెలలో కరోనా కేసులు చుక్కలు చూపించాయి. ఒక్క నెల రోజుల్లోనే 4 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే కరోనా 5 లక్షల నుంచి 6 లక్షలకు చేరుకోవడానికి కేవలం పట్టిన సమయం 5 రోజులు మాత్రమే. దాదాపుగా ప్రతీ రోజు కూడా 20 వేల వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా తీవ్రత మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో ఎక్కువగా ఉంది. తెలంగాణాలో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: