అచ్చెన్నాయుడు అవినితికి పాల్పడలేదని ఒక్క టీడీపీ నాయకుడు చెప్పడం లేదని మంత్రి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన రాజ్యసభ ఎన్నిక కావడంతో నిన్న సాయంత్రం తిరుమలకు వెళ్ళారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటోందని ఆయన పేర్కొన్నారు. 

 

అచ్చెన్న అరెస్ట్‌పై మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవినీతికి పాల్పడితే అచ్చెం అయినా చంద్రబాబైన అరెస్ట్ కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. బీసీలు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న వ్యక్తి సిఎం జగన్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీసీలకు కేటాయించారన్న ఆయన... బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేలా జగన్ పరిపాలన చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు

మరింత సమాచారం తెలుసుకోండి: