శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుని అడ్డుకోవడంపై టీడీపీ నేతలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో అధికార వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం ఆరోపించారు. మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాత్మక పాత్ర పోషించాలని ఆయన హితవు పలికారు. 108,104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: