జీవీకే  గ్రూప్ కంపెనీ చైర్మన్ జివి కృష్ణారెడ్డి ఆయన కుమారుడు పై సిబిఐ కేసు నమోదు అయింది. 705 కోట్ల అక్రమాలకు సంబంధించి మోసానికి  పాల్పడ్డారంటూ ఈ కేసు నమోదు అయింది. విమానాశ్రయాలు అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్,  జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది.


ఇందులో ముంబై విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2017-18 సంవ త్సరంలో బోగస్  కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చినట్లు చూపించి నిధులను దారి మళ్లించినట్లు సిబిఐ ఆరోపించింది. ఈ క్రమంలోనే 705 కోట్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో  జీ వి కృష్ణారెడ్డి ఆయన కుమారుడు విమానాశ్రయం మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రెడ్డి పై సీబీఐ కేసు నమోదైంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: