ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల క్రితం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి రోజు రోజు కీ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం దగ్గర అర్ధరాత్రి కంటైనర్ లారీ కారును వెనుకనుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఇద్దరు చనిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.   విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

 కాగా, మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: