ఆంధ్రప్రదేశ్ విపక్ష తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి  ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వంపై కాస్త దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు  వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తున్నారు. అయితే  వైసీపీ అధికార మీడియాలో పని చేసే కొమ్మినేని శ్రీనివాస్... పట్టాభిపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసారు. 

 

ఆయనకు ఊరు పేరు లేదు అని విమర్శించారు. దీనిపై పట్టాభి కాస్త ఘాటుగానే స్పందించారు. తమది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కుటుంబం అని తమ తాతకు ఆ చరిత్ర ఉంది అని తమది కొమ్మారెడ్డి వంశం అని, పుచ్చలపల్లి సుందరయ్య గారితో కలిసి ఉద్యమాలు చేసారు అని ఆయన పేర్కొన్నారు. ఇంకో సారి వ్యక్తిగత విమర్శలు చేస్తే మర్యాదగా ఉండదు అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: