పౌర హక్కుల నేత వరవరరావు ఆరోగ్యం విషమంగా ఉందని జైలు అధికారులు ఆయన భార్యకు నేడు ఉదయం ఫోన్ చేసి చెప్పడం కలకలం రేపింది. ఆయన ఆరోగ్యం క్రమంగా విషమిస్తుంది అని చెప్పారు. ఆయనకు తలోజా జైలులోనే తాము చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆయన బెయిల్ పిటీషన్ ని కింది స్థాయి కోర్ట్ కొట్టేసింది. 

 

అయితే భీమా కారేగావ్ ఘటన లో ఆయన ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ ఆరోపిస్తుంది. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి అని చెప్పడంతో లోయర్ కోర్ట్ అంగీకరించి ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించింది. ఇక ఆయన ముంబై హైకోర్ట్ లో తన బెయిల్ పిటీషన్ ని దాఖలు చేసారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: