కేంద్ర మంత్రి విద్యుత్ గురించి మాట్లాడితే ఆమెపై విమర్శలు చేసారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సమస్యను ఎదుర్కొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి అని చంద్రబాబు సూచించారు. ఏపీ సర్కార్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంది అని ఆయన మండిపడ్డారు. 108 వాహనాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు. 

 

తాము ప్రతీ కుటుంబానికి  5 వేల సాయం చెయ్యాలి అని డిమాండ్ చేసామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏపీలో అంబులెన్స్ లను కొత్తగా తెచ్చినట్టు షో చేసారని ఆయన ఆరోపణలు చేసారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ని తయారు చేయడం శుభ పరిణామం అని ఆయన అన్నారు. కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తే తమను విమర్శించారు అని చంద్రబాబు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: