మాస్క్ పెట్టుకోవాలి అని ఎంత మంది చెప్పినా సరే ఎవరూ వినడం లేదు. ఇప్పుడు లాభం లేదు అని భావించి భారీగా ఫైన్ లు వేయడానికి సిద్దమయ్యారు. ఈ నేపధ్యంలోనే మార్చి 22 నుంచి జూన్ 30 వరకు తెలంగాణాలో మాస్కులు ధరించని 67,557 మందిపై తెలంగాణా పోలీసులు కేసులు నమోదు చేసారు. మరో 3,288 మందికి ఈ-చలానాలు  కూడా జారీ చేయడం గమనార్హం. 

 

మాస్క్ లేకుండా రెండు సార్లు దొరికితే జైలుకి కూడా పంపిస్తారు. హైదరాబాద్ పరిధిలో 14,931 కేసులు నమోదు కాగా రామగుండం కమిషనరేట్ పరిధిలో 8,290 కేసులు నమోదు చేసారు. అలాగే ఖమ్మం జిల్లాలో 6,372 మందిపై కేసులు నమోదు చేసారు. సూర్యాపేటలో 4,213 కేసులు నమోదు చేసారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: