ఒక పక్క భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నా సరే భారత ఆర్మీ ని లక్ష్యంగా చేసుకుని చైనా బలగాలను భారీగా మొహరిస్తుంది. తాజాగా మరో పది వేల మంది బలగాలను చైనా ఆర్మీ మోహరించింది అని వార్తలు వస్తున్నాయి. లడఖ్ లో రేపు రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన  నేపధ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. 

 

ఆయన పర్యటన విషయంలో చైనా కాస్త ఆగ్రహం గా ఉంది. ఒక పక్క చర్చలు  జరుపుతున్నాం అని చెప్తూనే చైనా  ఈ విధంగా బలగాలు మొహరించడానికి ప్రయత్నాలు చేయడంపై అంతర్జాతీయ సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది చైనా బుద్ధి అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: