ఆంధ్రప్రదేశ్ మాజీ నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్ట్ కి చేరింది. ఆయనను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలి అని రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా... దానిపై  ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ లో ఏపీ సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలి అని కోరింది. 

 

కాగా ఆయన సస్పెన్షన్ ని క్యాట్ కూడా సమర్ధించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్ట్ మాత్రం ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా దాదాపుగా  పక్కన పెట్టింది.  ఇక క్యాట్ ఆదేశాలు ఇచ్చింది అంటూ ఏపీ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: