రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా రైతుల ఖాతాలో నుంచి డబ్బులు స్వాహా చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది,
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు లో ఎయిర్టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో సైబర్ నేరగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎయిర్టెల్ కేవైసీ ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకుని 150 మంది రైతులు ఖాతాల్లో సుమారు 15 లక్షల రూపాయల నగదును స్వాహా చేశారు, దీనిపై ఎయిర్టెల్ కార్యాలయాన్ని ఆశ్రయించిన సిబ్బంది స్పందించలేదు దీంతో పోలీసులను ఆశ్రయించారు రైతులు.