1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కూడా ఉన్న విషయం తెలిసిందే, ఇక ఈ కేసులో తాజాగా ఉమాభారతి సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.
ప్రాసిక్యూషన్ తరపు సాక్షులను వివరించిన మీదుట సిఆర్పీసీ సెక్షన్ 313 కింద సిబిఐ కోర్టు ప్రస్తుతం 32 మంది నిందితులు వాంగ్మూలం రికార్డు చేస్తోంది.. మూడు దశాబ్దాల కాలం నాటి ఈ కేసులో ఉమాభారతి 19 నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత ఎం ఎం జ్యోషీ, కళ్యాణ్ సింగ్ సహా మరో 13 మంది ఇంకా సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది.