కరోనా వైరస్ బంధాలను బంధుత్వాలను మరిచేలా చేస్తుంది. తాజాగా ఇక్కడ జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
వృద్ధురాలు అయిన తన తల్లికి కరోనా వైరస్ అని తేలడంతో దారుణంగా రోడ్డుపైనే వదిలేసి వెళ్లాడు కుమారుడు, ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అయితే అనుమానాస్పదంగా ఆ వృద్ధురాలు కనిపించగా ఏంటని స్థానికులు ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.