ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కకావికలం చేస్తోన్న కరోనా మహమ్మారి మన దేశాన్ని కూడా కబలించేస్తోంది. నిన్నటి వరకు మన దేశం కరోనా ర్యాంకిగ్లో ఎక్కడో ఉండేది. అయితే రోజుకు సగటున ఏకంగా 20 వేల కొత్త కేసులు నమోదు అవుతుండడంతో ఇప్పుడు భారత్లో ఏకంగా 6 లక్షల కరోనా కేసులు వచ్చాయి. అంటే ప్రతి ఐదు రోజులకు లక్ష కేసులు ఇక్కడ కొత్తగా నమోదు అవుతున్నాయి. ఎంత రికవరీ రేటు 58 శాతం ఉన్న కొత్త కేసుల పెరుగుదల చూస్తే గుండె గుబేల్ మనక మానదు.
ఇక ఇప్పుడు భారత్ ఈ విషయంలో ప్రపంచ రికార్డు దిశగా దూసుకు పోతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రష్యా కంటే భారత్ కేవలం 50 వేల కేసుల దూరంలో నిలిచింది. 26 లక్షల కేసులతో అమెరికా, 14 లక్షల కేసులతో బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పీడ్ చూస్తే మరో రెండు రోజుల్లోనే భారత్ రష్యాను అధిగమించేలా ఉంది.