టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని సబ్ జైలు కి పంపడం పై ఇప్పుడు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా దీనిపై కాస్త ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

3వారాలుగా రాజకీయకక్షతో తప్పుడు కేసులుపెట్టి అచ్చెన్నాయుడు గారిని  మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతూ కుటుంబ సభ్యులను, ఎంపీ  రామ్మోహన్ నాయుడుని కూడా కలవనివ్వకుండా బలవంతంగా ఆస్పత్రి నుండి అంబులెన్స్ లో జైలుకు తరలించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? చెప్పండి సిఎం వైఎస్ జగన్ గారూ అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సిఎం జగన్ ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: