ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కులు క‌త్తి మ‌హేష్‌కు క‌రోనా పాజిటివ్ ఉంద‌ని ఈ రోజు ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు సోష‌ల్ మీడియాలో ఈ వార్త‌ను వైర‌ల్ చేయ‌డంతో కొన్ని వెబ్‌సైట్లు సైతం ఇదే వార్త‌గా ప్ర‌చురించాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన ఆయ‌న ఇండియా హెరాల్డ్ ప్ర‌తినిధితో మాట్లాడుతూ  త‌న‌కు క‌రోనా లేద‌ని... ప్ర‌స్తుతం క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోన్న వేళ ఇలాంటి వార్త‌లు ఎందుకు ప్ర‌చురిస్తార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

 

త‌న‌కు క‌రోనా ఉంద‌ని వార్త‌లు ప్ర‌చారం చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కూడా హెచ్చ‌రించారు. తాను మీడియాలో ఉన్నందున కొద్ది రోజుల క్రిత‌మే మీడియా ప్ర‌తినిధులు అంద‌రికి టెస్టులు చేయించార‌ని... ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ ఉన్న వారు క్వారంటైన్‌లో ఉన్నార‌ని... ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్త‌లు ఎందుకు రాస్తార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: