టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని సబ్ జైలుకి పంపడం పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్  మీడియా వేదికగా అలాగే  ప్రధాన మీడియాలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది విపక్షం. తాజాగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపిందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. అచ్చెన్నాయుడుకు బెయిల్‌ వస్తుందనే రాత్రికి రాత్రి జైలుకు పంపారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ తీరు రాక్షసంగా ఉందని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: