ఏడాదిలో ఇచ్చిన హామీలు పూర్తి చేసిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదు అని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ చనిపోతే వేలాది గుండెలు ఆగిపోయాయి అని చెప్పారు. చంద్రబాబు ఎపీని 2.6 లక్షల కోట్ల అప్పులలోకి నెట్టారు అని అన్నారు. 

 

ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత ఒక్క సిఎం  జగన్ కే దక్కుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంలో మేనిఫెస్టో లో ఉన్న అన్ని హామీలు అమలు చేసామని ఈ సందర్భంగా సజ్జల వ్యాఖ్యానించారు. చెప్పిన అబద్దన్నే పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. అసలు మతిమరుపు చంద్రబాబుకి ఉందని సజ్జల మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: