ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కరోనా కట్టడికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసే అవకాశం ఉంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరీక్షలను  ఎక్కువగా చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇక ఏపీలో కనీసం ప్రతీ రోజు కూడా 50 వేల కరోనా పరిక్షలు చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఏపీలో కరోనా  పరిక్షలకు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్దం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 వేల కరోనా పరిక్షలు అత్యధికంగా చేసారు. ఇక కొన్ని జిల్లాల్లో ప్రతీ ఇంటికి కరోనా పరిక్షలు  చేయడం మంచిది అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పరిశీలకులు అంటున్నారు. రాబోయే వారం రోజుల్లో కరోనా పరీక్షలను పెంచే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: