ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పార్టీ బాధ్యతలను అధికార వైసీపీ ... వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇవ్వడంపై విపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. తాజాగా... టీడీపీ అధికార ప్రతినిధి ఈ పరిణామం పై కాస్త ఘాటుగా స్పందించారు. 

 

సామాజిక అన్యాయం లో జగన్ రెడ్డి గారు నెంబర్ 1 అని ఆమె పేర్కొన్నారు. పాదయాత్ర లో కనిపించిన సామజిక న్యాయం ఇప్పుడు కనుచూపు మేర లో కనపడటం లేదు అని ఆమె విమర్శించారు. ఉత్తరాంధ్ర- విజయ సాయి రెడ్డి, రాయలసీమ- సజ్జల రామ‌కృష్ణా రెడ్డి, కోస్తాంధ్ర- వైవీ సుబ్బా రెడ్డి. రాజారెడ్డి రాజ్యాంగంలో సామాజిక న్యాయం అంటే రాజ్యాన్ని బంధువర్గానికి సమానంగా పంచడమే అని ఆమె ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: