తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. గురువారం మరో 4,343 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని ఆ రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 98,392కి చేరినట్లు స్పష్టం చేసింది. మరో 57 మంది వైరస్ తీవ్రతకు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,321కి చేరినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 41,047 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది. ఈరోజు 3,095 మంది డిశ్చార్జి కాగా.. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 56,021కి చేరినట్లు తెలిపింది.