ఒడిశా కందమాల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సీపీఐ(మావోయిస్ట్) స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు చేరుకునేసరికే అక్కడి నుంచి మావోయిస్టులు పారిపోయినట్లు వెల్లడించారు.
స్థావరంలోని బ్యాగులు, బూట్లు, డాక్యుమెంట్లు, మావోయిస్టు రచనలకు సంబంధించిన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. ఫిరింగియా పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండేళ్లుగా మావోయిస్టుల కదలికలు పెరిగాయన్నారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల సీపీఐ(మావోయిస్ట్)కు చెందిన 15-20 మంది కేకేబీఎన్ డివిజన్ దస్సారు ప్రాంత కమిటీ సభ్యులు సమర్బంధ్ గ్రామ సమీపంలో సమావేశమైనట్లు సమాచారం ఉందన్నారు.