ఒడిశా కందమాల్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సీపీఐ(మావోయిస్ట్​) స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్​ పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు చేరుకునేసరికే అక్కడి నుంచి మావోయిస్టులు పారిపోయినట్లు వెల్లడించారు.

 

స్థావరంలోని బ్యాగులు, బూట్లు, డాక్యుమెంట్లు, మావోయిస్టు రచనలకు సంబంధించిన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. ఫిరింగియా పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత రెండేళ్లుగా మావోయిస్టుల కదలికలు పెరిగాయన్నారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల సీపీఐ(మావోయిస్ట్​)కు చెందిన 15-20 మంది కేకేబీఎన్​ డివిజన్​ దస్సారు ప్రాంత కమిటీ సభ్యులు సమర్బంధ్​ గ్రామ సమీపంలో సమావేశమైనట్లు సమాచారం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: