ఉత్తర ప్రదేశ్ కాన్పుర్లో దారుణం జరిగింది. వికాస్ దూబే అనే రౌడీ షీటర్ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు.
మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో ఆరుగురు పోలీసులు, సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.