కాన్పుర్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
వికాస్ దూబే అనే రౌడీ షీటర్ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో ఆరుగురు పోలీసులు, సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.