కాన్పుర్​ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 

 

 

వికాస్​ దూబే అనే రౌడీ షీటర్​ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్​ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో ఆరుగురు పోలీసులు, సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: