పాకిస్థాన్​లో రెండు గిరిజన బృందాల మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42మందికి గాయాలయ్యాయి. వాయువ్య పాక్​​లోని గిరిజన ప్రాంతంలో తలెత్తిన ఓ భూ వివాదంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి.

 


కుర్రం జిల్లాలో నాలుగు రోజులుగా టోరి- పారా చంకాని తెగల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు అత్యాధునిక ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నట్టు అధికారులు తెలిపారు.ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు స్థానిక పాలనాధికారులు, గిరిజన పెద్దలు సహా అక్కడి పార్లమెంట్​ సభ్యులు రంగంలోకి దిగారు. రెండు సమూహాలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున అధికారులు.. గురువారం ఈ వివాదానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: