మనదేశంలో కరోనా దెబ్బతో పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ సోకింది. తాజాగా ఏపీలో రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి సైతం కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కరోనా కల్లోలం క్రియేట్ చేస్తోన్న మహారాష్ట్రలో నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.
మరో మహిళా ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా వైరస్ సోకింది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే భర్తకు పరీక్షలు చేయగా ఆయనకు కూడా కరోనా ఉందని తేలడంతో వారిద్దరిని హోం క్వారంటైన్ చేశారు. గతంలో థానే జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీకి కొవిడ్-19 సోకింది. థానే జిల్లాలోనే మరో మహిళా ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది.