ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రైతు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఏ విధంగా కూడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటుంది. రైతు భరోసా సహా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇప్పటికే రైతులకు రైతు భరోసా రూపంలో దాదాపు 10 వేల కోట్లను ఏడాది కాలంలో ఏపీ సర్కార్ రైతులకు అందించింది. 

 

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. “మా  పార్టీ పేరులోనే కాదు - ప్రభుత్వ ప్రయారిటీలోనూ ముందుంటాడు రైతన్న. రాష్ట్రంలోని రైతన్నల ఉత్పత్తులను కొనుగోలు చేసి జనతాబజార్లు, E మార్కెటింగ్  ద్వారా వినియోగదారులకు చేర్చనుంది జగన్ గారి ప్రభుత్వం. ఇకపై  దళారీల మోసాలుండవు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతే రాజు. అని ఆయన పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: