కరోనా వైరస్ ని ఆరోగ్య శ్రీ లో చేర్చడం సహా రాష్ట్రంలో వైద్య రంగంలో అనేక మార్పులకు ఏపీ సర్కార్ శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంశలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో సిఎం జగన్ పై ప్రసంశలు కురిపించారు. 

 

కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు. పది రెట్లు పెరిగిన ఐసియూ బెడ్లు, వెంటిలేటర్లు. కొత్తగా 108 అంబులెన్సులు, పబ్లిక్ హెల్త్ కేర్ రంగం సాచ్యురేషన్ స్థాయికి దూసుకెళ్తోంది. ఆరోగ్య శ్రీలో కరోనాను కూడా చేర్చారు సిఎం జగన్ గారు. విద్య, ఆరోగ్యం ఆయన ప్రాథమ్యాలలో ముందున్నాయని ఆయన ఈ సందర్భంగా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: