ఇంటెల్ క్యాపిటల్ జియో ప్లాట్ఫామ్స్లో రూ .1,894 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్ట్నర్స్ (రెండు పెట్టుబడులు), విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, టిపిజి, ఎల్ కాటర్టన్, పిఐఎఫ్, ఇంటెల్ వంటి ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ .117,588.45 కోట్లు సేకరించింది జియో.
ఇప్పుడు మరోసారి భారీ పెట్టుబడులు సంస్థకు రానున్నాయి. దేశంలో టెక్నాలజీ రంగంలో ఇంటెల్ క్యాపిటల్ ముందు వరుసలో ఉంది. దేశ వ్యాప్తంగా జియో రేంజ్ పెరుగుతుంది. ఒక పక్క లాక్ డౌన్ ఉన్నా సరే జియో మాత్రం పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దూసుకుపోతుంది. భారత్ లో జియో ఇప్పుడు టెక్నాలజీ రంగంలో పలు సంస్థలతో పోటీ పడుతుంది.