ఒక  పక్క సరిహద్దుల్లో భారీగా చైనా మొహరిస్తున్న తరుణంలో మీడియాకు ఏ విధమైన సమాచారం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ పర్యటనకు వెళ్ళారు. నాలుగు రోజుల నుంచి ఆయన వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి గాని ఎక్కడా దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. ఇక ఆయన అనూహ్యంగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తో కలిసి వెళ్ళారు. 

 

ఆయన పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యుద్ద భూమిగా ఉన్న ఆ ప్రాంతంలో మోడీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. అంతర్జాతీయ సమాజం కూడా దీనిపై ఆసక్తిగా చూస్తుంది. ఆయన ఎందుకు వెళ్ళారు అనేది తెలియడం లేదు. యుద్ద భూమిలో ప్రధాని కాలు పెట్టడంతో ఒక్కసారిగా పలు దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: