దేశంలో మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. డబ్బు మాత్రమే పరమావధిగా భావిస్తున్నారు. ఇందు కోసం ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. తాజాగా తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో దారుణం జరిగింది. 7 సంవత్సరాల బాలిక అరంతాంగి గ్రామంలో రెండు రోజులక్రితం అదృశ్యమైంది. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న సమయంలో గ్రామంలోని చెరువు దగ్గర తీవ్ర గాయాలతో బాలిక మృతదేహం దొరకడం తో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.
రాజా అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసి అతి కిరాతకం గా అత్యాచారం చేసి హత్య చేసిన పోలీసులు నిర్ధారించారు. రాజా అనే యువకుడిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఘటనను తీవ్రం గా ఖండించిన డీఎంకే నేత ఎంపీ కనిమొళి ,ఘటనపై నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాలిక కుంటుంబానికి తప్పకుండ న్యాయం చేస్తామని సీఎం భరోసా , 5 లక్షలు ఎస్గ్రేషియా ప్రకటించిన తమిళనాడు సీఎం పళనిస్వామి.