భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల గురించి అందరికి తెలిసిందే. చైనా భారత్ ఎప్పుడు అయినా సరే యుద్ధం చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇక భారత్ కూడా యుద్దానికి సిద్దం అవుతూ... చైనా సరిహద్దుల్లో బలగాలను భారీగా మొహరిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడి కి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. 

 

ప్రధాని మోడీ ప్రస్తుతం లడఖ్‌లోని నిములోని ఫార్వర్డ్ లొకేషన్స్‌లో ఉన్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఆయన తెల్లవారుజామున అక్కడకు చేరుకున్నారని చెప్పింది. ఆర్మీ, వైమానిక దళం మరియు ఐటిబిపి సిబ్బందితో సంభాషిస్తున్నారని పేర్కొంది. 11,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం కఠినమైన భూభాగాలలో ఒకటి. చుట్టూ జాన్స్కర్ పర్వత శ్రేణి మరియు సింధు నది ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: