క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. తాజాగా ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల‌లో 10 మందికి టీటీడీ సిబ్బందికి క‌రోనా వ‌చ్చినట్టు స‌మాచారం. వీరిలో నలుగురు సన్నాయి వాయిద్యకారులుతో పాటు ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన‌ట్టు స‌మాచారం. ఇక మరో ఐదుగురు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి కరోనా వ‌చ్చింద‌ని అంటున్నారు.

 

ఒకే సారి ఏకంగా 10 మంది టీటీడీ సిబ్బందికి క‌రోనా రావ‌డంతో వెంట‌నే అలెర్ట్ అయ్యార‌ట‌. ఇక ఈ సిబ్బంది నుంచి భక్తులకు కరోనా సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని ప‌రిమితుల‌తో తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తున్నారు. ఇప్పుడు క‌రోనా మ‌రింత విజృంభిస్తోన్న ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో ఈ స‌మావేశంలో నిర్ణయించ‌నున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: