ఓడిశాలో కరోనా విలయ తాండవం మొదలయింది. ఇప్పటి వరకు వంద నుంచి 200 కేసుల వరకు నమోదు కాగా నిన్న ఒక్క రోజే అక్కడ 500 కేసులకు పైగా నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జూలై 2 న , ఒడిశాలో 561 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

 

కరోనా నుంచి రాష్ట్రంలో మొత్తం  5502 మంది కోలుకున్నారు అని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసులు ఒక్కసారి చూస్తే 2567 ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 8106 కి చేరుకుందని ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఇక కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: