ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. కోర్ట్ తీర్పులను ఆధారంగా చేసుకుని పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో ఎవరూ పరిధులు దాటకూడదని ఏపీ స్పీకర్ గారే సెలవిచ్చారని అన్నారు.
కానీ ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థను మీరే నిర్వీర్యం చేసేశారని ఆయన పేర్కొన్నారు. మీ నియంతృత్వ నిర్ణయాలు, కక్ష సాధింపులతో అభివృద్ధి కుంటుపడటంతో పాటు ప్రజల భవిత ప్రమాదంలో పడుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు న్యాయ వ్యవస్థనూ బెదిరించడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్య విధానానికి అతీతమని అనుకుంటున్నారేమో అంటూ ట్వీట్ చేసారు.
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో ఎవరూ పరిధులు దాటకూడదని ఏపీ స్పీకర్ గారే సెలవిచ్చారు. కానీ ఇప్పటికే కార్యనిర్వాహక వ్యవస్థను మీరే నిర్వీర్యం చేసేశారు.మీ నియంతృత్వ నిర్ణయాలు,కక్ష సాధింపులతో అభివృద్ధి కుంటుపడటంతో పాటు ప్రజల భవిత ప్రమాదంలో పడుతోంది.
— Somireddy chandra mohan Reddy (@Somireddycm) July 3, 2020
(1/2) pic.twitter.com/WNhpAyUXkI